bhishma parvam

Mahabharatam-Bhishma Parvam(vol-8)

భీష్మపర్వం

Bhishma Parvam

పుణ్యస్థలమైన ఆ కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు గుడారాలు నిర్మించి సేనలతో పన్ద్ధమైన సమయంలో యుద్ధానికి ధృతరాష్ట్రుడు సంజయునితో కూడియుండి తన కొడుకు గర్వానికి దుఃఖించడం గమనించి మూడు కాలాల పోకడ తెలిసినట్టి వ్యాసమహర్షి అక్కడికి వచ్చి అతడితో ఈ విధంగా అన్నాడు.
‘కెమెరా! పోయేకాలం దగ్గరపడి రాజులకు యుద్ధం దాపురించింది. దీనికి నీవు విచారించకు

ఆ యుద్ధాన్ని చూడాలని కోరికగా ఉంటే, నాకు దివ్యదృష్టి నిస్తాను.’
ఆ విధంగా వేదవ్యాస మహర్షి చెప్పిన పిదప, ధృతరాష్ట్రుడు ఈ రీతిగా బదులు పలికాడు: ‘అన్నదమ్ములు చేసే ఘోర యుద్ధం నేను చూడలేను. వినగలను అంతే. నేను వినే ఏర్పాటు చేస్తే చాలు.’ ఆ మాటలకు వేదవ్యాసుడు కరుణించి, యుద్ధ విషయాలను జరిగినవి జరిగినట్లుగా (యథాతథంగా) చెప్పుమని సంజయుడిని నియోగించాడు.
వ్యాసుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడు, యుద్ధ విశేషాలు వినిపించే ఏర్పాటు చేశాడు. అంతేకాక వార్తాహరుడైన సంజయుడు కొన్ని అతిలోక శక్తులు ప్రసాదించాడు. సంజయుడు యథేచ్ఛగా యుద్ధభూమిలో వేగంగా విహరించవచ్చును.
అతడిని ఏ ఆయుధాలు తాకజాలవు. అతడు ఇతరుల మనస్సులను పసిగట్టగలడు వేల్పుల రూపాలు చూడగలరు: మాటలు వినగలడు. ఇట్టి వరాలను అనుగ్రహించి వ్యాసమహర్షి ధృతరాష్ట్రుడు చూచి, ఈ యుద్ధం విధివిలాసం వలన వచ్చింది. భూభారం తగ్గగలదు. దీనికోసం దుఃఖింపవద్దు’ అని ఊరడించి ధర్మం జయించుగాక! చింత వీడి ప్రశాంతంగా ఉండుము.
మబ్బులు లేకుండానే ఆకాశంలో ఉరుములు సంక్షోభం రేకెత్తించాయి. ఏనుగుజ్జూ, గుర్రాలు మిక్కుటంగా కన్నీరు కార్చాయి. జంతువులు పక్షులను కన్నాయి. ఆవులు జంతువులను కన్నాయి.

ఇక చదవండి……

Bhishma Parvam Download PDF Book 

Read Bhishma Parvam online here

maha-bharatham-vol-8-bheshma-parvam
Follow us on Social Media

2 comments